ఒటావా: కెనడాలోని ఖలిస్తానీ తీవ్రవాదులు ఆ దేశానికి జాతీయ భద్రతా ముప్పుగా మారారని కెనడియన్సెక్యూరిటీ ఇంటెలిజెన్స్సర్వీస్(సీఎస్ఐఎస్) హెచ్చరించింది. తమ హింసాత్మక ఎజెండాను ప్రచారం చేయడానికి వారు కెనడాలోని సంస్థలను వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
సీఎస్ఐఎస్ గత శుక్రవారం విడుదల చేసిన తన 2025 వార్షిక నివేదికలో కీలక అంశాలను వెల్లడించింది. కెనడాలోని కొందరు ఖలిస్తానీ తీవ్రవాదులు సామాన్య పౌరుల నుంచి సేకరించిన నిధులను హింసాత్మక కార్యకలాపాలకు మళ్లిస్తున్నారని తెలిపింది.
